ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’ ఈ గురువారం విడుదల కాబోతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ఎన్టీఆర్ కలయికలో వస్తున్న ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఉత్సాహాన్ని మరింత పెంచుతూ ఆంద్రప్రదేశ్లో ఈ చిత్రానికి ప్రత్యేక అనుమతి లభించింది.
రోజుకి నాలుగు ఆటలు కాకుండా ఆరు ఆటలు ఆడించుకునే సౌలభ్యం ఈ చిత్రానికి లభించింది. ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల లోపు అదనంగా రెండు షోలు వేసుకునే అవకాశం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దసరా సీజన్లో విడుదల అవ్వడం అరవిందకు కలిసొచ్చిన విషయం. సెలవుల్ని దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక ఆటలకు అనుమతి ఇవ్వాల్సిందిగా చిత్రబృందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.
దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం ఈనెల 11 నుంచి 18 వరకూ ప్రత్యేక ఆటలకు అనుమతిచ్చింది. ఇది అరవింద సమేత నిర్మాతకు, బయ్యర్లకూ కలిసొచ్చే అంశమే. తెలంగాణ ప్రభుత్వం మాత్రం బెనిఫిట్ షోలకు ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదు. ఈ విషయమై అరవింద బృందం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించి, మరోసారి అభ్యర్థించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక ఆటలు కుదరకపోయినా ఒకరోజు ముందు ఫ్యాన్స్ షోలకైనా అనుమతి ఇవ్వమని చిత్రబృందం కోరనుంది.