Tollywood: హిట్ చిత్రాలకి అడుగు దూరంలో ఆగిపోయిన ముద్దుగుమ్మలు!

Tollywood: ఏ రంగంలో అయినా విజయం ముఖ్యం. సినీ రంగంలో అయితే విజయం మీదనే కెరీర్ ఆధారపడి ఉంటుంది. హిట్ చిత్రాల్లో నటిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుంది ఇండస్ట్రీ లో. కొన్ని చిత్రాలు హీరో,హీరోయిన్ ల కెరీర్ లో మైలురాయి గ నిలుస్తాయి. అంతే కాదు కొన్ని చిత్రాలు వాళ్ళ కెరీర్ కి మంచి బాట వేస్తాయి. చిరు తనయుడు రామ్ చరణ్ కెరీర్ లో మగధీర నిలిచిపోయినట్టు.

హిట్ సినిమాల్లో నటించలేకపోయిన హీరోయిన్లు..

హీరోలకే కాదు హీరోయిన్ లకు కూడా కెరీర్ ని చక్కపెట్టే సినిమాలు ఉంటాయి. అలాంటి హిట్ చిత్రాలను కొంతమంది హీరోయిన్లు చేజార్చుకున్నారు. ఒకవేళ వాళ్ళు ఆ సినిమాలు చేసి ఉంటే వాళ్ళ కెరీర్ వేరే స్థాయిలో ఉంటుంది. అలా హిట్ సినిమాలను వదిలేసుకున్న కొంతమంది హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.

రంగస్థలం: ఇండస్ట్రీ కి వచ్చి 10 ఏళ్ళు అయ్యింది,ఏదైనా కొత్తగా చేయాలి అని రామ్ చరణ్ చేసిన ప్రయత్నమే రంగస్థలం. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా చేసిన సమంతకి మంచి మార్కులే పడ్డాయి. అయితే ముందుగా ఈ చిత్రానికి అనుకున్న నాయిక అనుపమ పరమేశ్వరన్ అట.

నారప్ప: విక్టరీ వెంకటేష్ లో మరో నటుడ్ని మనకి పరిచయం చేసిన చిత్రం. అయితే ఇందులో ప్రియమణి పోషించిన పాత్ర అనుష్క చేయాల్సిందట. ఎందుకనో ఈ కన్నడ కస్తూరి చేయలేకపోయింది. దీంతో దర్శకుడు శ్రీకాంత్ అడ్డా ప్రియమణిని అడగటం ఆమె వప్పుకున్న విషయం తెలిసిందే. తెలుగులో మంచి విజయం సాధించిన జెర్సీ ని హిందీలో రీమేక్ చేశారు. ముందుగా రష్మికను కథానాయికగా పెట్టాలి అనుకున్నా కుదరలేదు. అయితే మృనాల్ ఠాకూర్ కి ఆ పాత్ర దక్కింది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం సినిమాల్లో నటించాలని చాలా మందికి ఉంటుంది. ఆయన తీసిన చెలియాలో ఒక పాత్రకి సాయి పల్లవి సంప్రదించారట. కుదరకపోతే అదితి రావు హైదరి ఆ పాత్ర పోషించి మంచి ప్రశంసలు అందుకున్నారు.

Similar Articles

Comments

తాజా వార్తల