Rajinikanth Latha: కుమార్తెలు పుట్టాక భార్యకు రజనీ విడాకులు ఇవ్వాలనుకున్నారా? కారణం అదేనట..

Rajinikanth Latha: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ గురించి సౌత్‌ ప్రేక్షకులకు సుపరిచితమే. రజనీకాంత్‌ స్టార్‌గా వెలిగిపోతున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయట. ఇద్దరు కుమార్తెలు పుట్టాక రజనీ తన భార్య లతకు విడాకులివ్వాలని అనుకున్నారట. కుమార్తెలు పుట్టాక వారిద్దరి మధ్య మనస్పర్దలు పెరిగాయని తెలుస్తోంది. తన వీరాభిమాని అయిన లతను ప్రేమ వివాహం చేసుకున్నారు రజనీ. కాలేజీ మ్యాగజైన్‌ కోసం రజనీకాంత్‌ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన లతను చూసి మురిసిపోయాడట రజనీ.

ఆ క్రమంలో పుట్టిన ప్రేమ పెళ్లి ప్రపోజల్‌ వరకు వెళ్లింది. ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో లత అందానికి, మాటలకు రజనీకాంత్ ముగ్దుడైపోయాడట. వెంటనే వివాహం చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాడట. ఏం చెప్పాలో తెలియక పెద్దవాళ్లను అడిగి నిర్ణయం చెబుతానని లత సమాధానం చెప్పారట. లత సమాధానం కోసం రజినీకాంత్ ఎదురు చూశారు. చివరకు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో పెళ్లి ఖాయమైంది.

కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన రజనీ?
1981లో తిరుపతిలో రజినీకాంత్ లతల పెళ్లి జరిగింది. 1982 లో పెద్ద అమ్మాయి ఐశ్వర్య రజినీకాంత్, 1984లో రెండో అమ్మాయి సౌందర్య రజినీకాంత్ జన్మించారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారంలో కలతలు వచ్చి చేరాయట. రజనీకి భక్తి ఎక్కువని, ఆ సమయంలో హరే కృష్ణ మూమెంట్ ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో అందులో పాల్గొంటూ రజనీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వచ్చాయి.

దీంతో రజనీ, లతల మధ్య గొడవలు జరిగాయట. అప్పట్లోనే పలు పత్రికల్లో రజనీ, లత విడాకులు తీసుకుంటున్నారంటూ కథనాలు వచ్చాయి. దీంతో రజనీ స్పందించారు. తనకు, లతకు మధ్య విభేదాలు రావడం నిజమేనని ఒప్పుకున్నారు. విడిగా ఉండాలని నిర్ణయించుకున్నామంటూ బాంబు పేల్చారు. తమ మధ్య ఎలాంటి ద్వేషం లేదని స్పష్టం చేశారు. దీంతో రజినీకాంత్-లత విడిపోవడం ఖాయమని చాలా మంది భావించారు. 1985లో ఈ వార్తలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. తర్వాత కొన్నాళ్లకు లత, రజనీకాంత్‌ తిరిగి కలిసిపోయారు. మనస్పర్థలు వీడి అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే, వీరి కుమార్తె ఐశ్వర్య విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచారు.

Similar Articles

Comments

తాజా వార్తల