Mahesh Babu: మహేష్‌ను రాజమౌళి అందుకే ఎంచుకున్నారు.. సీక్రెట్ బయటపెట్టిన విజయేంద్ర ప్రసాద్!

Mahesh Babu: తెలుగు సినిమా గతిని మార్చిన వ్యక్తిగా ఎస్ఎస్ రాజమౌళిని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ ఖ్యాతిని తన దర్శకత్వ ప్రతిభతో ప్రపంచ యువనికపై నిలబెట్టారాయన. ‘ఈగ’, ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో బాలీవుడ్, హాలీవుడ్ సహా ప్రపంచ సినీ ప్రేక్షకుల చూపును మన వైపునకు తిప్పడంలో ఆయన ఫుల్ సక్సెస్ అయ్యారు.

రాజమౌళి సినిమాలో చిన్న వేషం లభించినా చాలని ఎంతోమంది నటులు అనుకుంటారు. ఆయన చిత్రంలో నటిస్తే ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కుతుందనే వారి ఆశ. అలాంటి జక్కన్న తదుపరి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్నారు. జేమ్స్ బాండ్ తరహాలో అడ్వెంచరస్ యాక్షన్ మూవీగా దీనిని తెరకెక్కించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు.

రాజమౌళి–మహేష్ మూవీ గురించి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ లాంటి నటుడికి కథ రాయాలని చాలా మంది రచయితలు అనుకుంటారని విజయేంద్ర ప్రసాద్ మెచ్చుకున్నారు. మహేష్ చాలా ఇంటెన్సిటీ ఉన్న యాక్టర్ అని.. ఆయన నటించిన యాక్షన్ సీన్స్ లో ఆ తీవ్రత కనిపిస్తుందని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

ఆయన్ను దృష్టిలో పెట్టుకునే కథ రాశా: విజయేంద్ర ప్రసాద్
‘ఎన్నో రోజుల నుంచి సాహసోపేతమైన స్టోరీతో సాగే సినిమా తీయాలని రాజమౌళి అనుకుంటున్నారు. ఈ కథకు మహేష్ సరిగ్గా సరిపోతారని ఆయన్ను సెలెక్ట్ చేసుకున్నారు. నేను తనను దృష్టిలో పెట్టుకునే కథ రాశా. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో లొకేషన్లలో షూట్ చేయాలని అనుకుంటున్నాం. వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది’ అని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

Similar Articles

Comments

తాజా వార్తల