Rishab Shetty: మీడియా ముందు రష్మిక పరువు తీసేసిన ‘కాంతార’ దర్శకుడు

Rishab Shetty: ప్రస్తుతం చిత్రసీమలో కాంతార సినిమా గురించి పెద్ద చర్చే జరుగుతోంది. కన్నడలో ఎలాంటి అంచనాలు లేకుండా నిర్మించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా ఇప్పుడు టాక్ ఆఫ్ ది సినిమాగా నిలిచింది. పాన్ ఇండియా రేంజ్‌లో సౌత్ సినిమా స్టామినాను కాంతార చాటుకుంది. విడుద‌లైన అన్నీ చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఎవ‌రూ ఊహించ‌ని రేంజ్ క‌లెక్ష‌న్స్‌ను సాధించింది. దీనికి కారణం హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి మాత్రమే.

రిషబ్ శెట్టి ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. అతడి నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. దీంతో రిషబ్ శెట్టి తరచూ మీడియాలో కనిపిస్తున్నాడు. అయితే ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరోయిన్ రష్మిక గురించి రిషబ్ శెట్టి షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీనికి కారణం ఇటీవల బాలీవుడ్ మీడియాతో రష్మిక మాట్లాడుతూ తనకు ఆఫర్ ఇచ్చిన రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి గురించి ప్రస్తావించకుండా కొంత ఓవరాక్షన్ చేసింది.

కన్నడలో హిట్ అయిన కిరాక్ పార్టీ మూవీతో రష్మిక తన కెరీర్ ప్రారంభించింది. ఈ మూవీతో తనకు కెరీర్ ప్రసాదించిన నిర్మాత, దర్శకుడు రిషబ్ శెట్టి పేరు చెప్పకపోవడంతో పాటు తన మొదటి హీరో, మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి పేరును రష్మిక కావాలనే విస్మరించింది. అంతేకాదు తాను కాంతార మూవీని ఇప్పటివరకు చూడలేదని కూడా రష్మిక కామెంట్లు చేసింది. దీంతో సొంత కన్నడ అమ్మాయి అయి ఉండి కాంతార మూవీ చూడకపోవడంతో రష్మికపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండు చేతులు పైకెత్తి దండం పెట్టిన రిషబ్ శెట్టి
టిట్ ఫర్ టాట్ అన్నట్లు కాంతార విజయంతో బాలీవుడ్‌లనూ క్రేజ్ తెచ్చుకున్న రిషబ్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక పరువు తీసేశాడు. రష్మిక, సమంత, సాయిపల్లవి ఈ ముగ్గురిలో మీరు తదుపరి సినిమా ఎవరితో చేయాలనుకుంటున్నారు అని యాంకర్ ప్రశ్నించగా.. సాయి పల్లవి, సమంత పనితనం అంటే చాలా ఇష్టమని.. అవకాశం వస్తే కచ్చితంగా వాళ్లతో నటిస్తానని రిషబ్ శెట్టి చెప్పాడు. మరి రష్మిక అని యాంకర్ అడగ్గా చేతులు పైకి ఎత్తి దండం పెడుతూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో రిషబ్ శెట్టి, రష్మిక మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరింది.

Similar Articles

Comments

తాజా వార్తల