Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. టాలీవుడ్లో ఇప్పటి వరకు తనదైన శైలిలో సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు నాగచైతన్య. అక్కినేని వారసుడిగా వచ్చి నిలదొక్కుకున్న హీరోగా పేరు గడించాడు. మరో అక్కినేని వారసుడు అఖిల్ మాత్రం ఇంకా సెటిల్ అవ్వడానికి ఇబ్బందులు పడుతున్నాడు.
సమంతతో విడాకుల నేపథ్యంలో నాగచైనత్య కెరీర్ కాస్త చప్పగా సాగుతోంది. ఈక్రమంలో సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాలు సైతం నివ్వెరపోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య ఎన్సీ22 మూవీలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షెడ్యూల్ మొదటి విడత షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రెండో షెడ్యూల్ సెట్స్పైకి రానుందట.
అనుకున్న సమయానికి సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది సమ్మర్కల్లా మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట చిత్ర బృందం. తాజాగా నాగచైతన్య తీసుకున్న ఓ నిర్ణయంతో సెలబ్రిటీలు సైతం షాక్కు గురవుతున్నారట. కెరీర్లో మొదటి సారి ఇలాంటి రిస్క్ చేయబోతున్నాడని అంటున్నారు. అక్కినేని కుటుంబంలో ఎవరూ ఇలాంటి సాహసం చేయలేదని, నాగచైతన్య సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడంటున్నారు.
Naga Chaitanya: సైకో పాత్రలో నాగచైతన్య…
అక్కినేని కుటుంబంలో ఇప్పటి వరకు సాఫ్ట్ క్యారెక్టర్లు, మాస్ క్యారెక్టర్లు చేశారు. కింగ్ నాగార్జున సైతం మాస్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. అయితే, నాగచైతన్య మాత్రం కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాడట. తన తదుపరి మూవీలో సైకో పాత్రలో నటిస్తున్నాడనే సమాచారం ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిళ్లలో జోరుగా వినిపిస్తోంది. ఈ పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్తో ఉంటుందని తెలుస్తోంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో బాధపడి సైకోగా మారిన యువకుడి కథలో నాగచైతన్య నటిస్తున్నారని తెలుస్తోంది. థ్రిల్లర్ ఎలిమెంట్స్తో కూడిన మూవీగా ఇది తెరకెక్కుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నాగచైతన్య తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారుతోంది.