Yadamma Raju: కాబోయే భార్య కోసం కమెడియన్ యాదమ్మ రాజు మతం మారాడా?

Yadamma Raju: ఈటీవీలో ప్రసారమవుతున్న పటాస్ షోతో పాపులారిటీ తెచ్చుకున్న బుల్లితెర కమెడియన్ యాదమ్మ రాజు త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాను ప్రేమించి అమ్మాయి షార్లీ స్టెల్లాను యాదమ్మ రాజు వివాహం చేసుకోనున్నాడు. ఇటీవల యాదమ్మరాజు, షార్లీ స్టెల్లా నిశ్చితార్ధం జరిగింది. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి ఎంగేజ్‌మెంట్‌ను వైభవంగా నిర్వహించారు. అయితే యాదమ్మ రాజు హిందువు కాగా షార్లీ స్టెల్లా క్రిస్టియన్. వీళ్లిద్దరూ తమ ఇంట్లో పెద్దలను ఒప్పించి మతాంతర వివాహం చేసుకోబోతున్నారు.

అయితే కొంతమంది వీళ్ల ఎంగేజ్‌మెంట్ ఫోటోలు చూసి కుళ్లుకుంటున్నారు. నిశ్చితార్ధం ఫొటోలలో పెళ్లి కూతురు స్టెల్లా‌కు నుదిటిపై బొట్టు లేదని సోషల్ మీడియాలో కొందరు విమర్శిస్తున్నారు. ఆమె క్రిస్టియన్ కాబట్టి బొట్టు పెట్టుకోలేదని కొందరు వివరణ ఇస్తుండగా.. తల్లిదండ్రుల సంప్రదాయాలను పక్కనబెట్టి యాదమ్మ రాజు హిందూ మతాన్ని అవమానపరిచాడని కొందరు అతడిని ట్రోలింగ్ చేస్తున్నారు. ఆడదాని కోసం మతం మారడమేంటని ప్రశ్నిస్తున్నారు.

అయితే ప్రేమించుకున్నోళ్లు బాగానే ఉన్నారు. నిశ్చితార్ధం చేసిన వాళ్ల పేరెంట్స్ బాగానే ఉన్నారు. వాళ్ల మతాలు వేరైనా.. పిల్లల ఇష్టాన్ని గౌరవించి ఇంట్లో పెద్దలు వాళ్లిద్దరికీ పెళ్లి చేయడానికి అంగీకరించారు. ఇదంతా మానేసి ముఖానికి బొట్టు లేదు.. మతం మారాడంటూ విమర్శించడం బాగోలేదని యాదమ్మరాజు అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. నోటికొచ్చినట్లు వాగకుండా శుభాకాంక్షలు తెలిపి కొత్తజంటను ఆశీర్వదించాలని హితవు పలుకుతున్నారు.

టీవీ షోలో ప్రపోజ్ చేసిన యాదమ్మ రాజు
యాదమ్మరాజు, షార్లీ స్టెల్లా ఇద్దరు బుల్లితెర నటులే. పటాస్ కార్యక్రమంలో స్టూడెంట్ గా షోలో అడుగుపెట్టిన రాజు ఓ జోక్ వేసి హైలెట్ అయ్యాడు. రాజు బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ బాగుండడంతో పటాస్ షో లో కామెడీ చేసే అవకాశం లభించింది. షార్లీ స్టెల్లా కూడా పటాస్‌లో నటించింది. దీంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. తన ప్రేయసిని రెండేళ్ల క్రితమే ఆడియన్స్‌కి యాదమ్మరాజు పరిచయం చేశాడు. 2020 ఆగస్టు 22న జీతెలుగులో బాపు బొమ్మకు పెళ్లంట అనే టీవీ షోలో తన ప్రేయసిని స్టేజీ పైకి తీసుకొచ్చి మరీ యాదమ్మరాజు ప్రపోజ్ చేశాడు.

Similar Articles

Comments

తాజా వార్తల